Samantha: సమంత కోసం గంటల తరబడి నిరీక్షించిన అభిమానులు…. నా మనసు దోచుకున్నారు అంటూ సమంత పోస్ట్!

Samantha: సినిమా ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దకాలం పూర్తి అయిన ప్పటికీ ఏ మాత్రం తన క్రేజ్ తగ్గకుండా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న సమంత మరోవైపు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే వ్యాపార రంగంలో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా సమంత నల్గొండ జిల్లాలో పర్యటించారు నల్గొండలోని మాంగల్య షాపింగ్ మాల్ చెన్నై ప్రారంభోత్సవ కార్యక్రమానికి సమంత హాజరయ్యారు.ఈ విధంగా సమంత షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వస్తున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు సమంత కోసం గంటల తరబడి నిరీక్షించారు. ఈ క్రమంలోనే సమంత రావడంతో ఆమెకు అభివాదం చేయగా సమంత కూడా వారందరిని పలకరిస్తూ నల్గొండ నగరంలో సందడి చేశారు. సమంత మాంగల్య షాపింగ్ మాల్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే నల్గొండ లో ప్రారంభమైన నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవానికి వచ్చారు.

పట్టు చీర కట్టుకొని సమంత అచ్చమైన తెలుగు అమ్మాయిలా నల్గొండ జిల్లాలో పర్యటించడంతో ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నల్గొండ జిల్లా ప్రజలు నా మనసును దోచుకున్నారు అంటూ సమంత కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సమంత విషయానికొస్తే ప్రస్తుతం ఈమె యశోద సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్నారు.