మార్కెట్ ఢమాల్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం, చమురు ధరల మంట, నిత్యావసర ధరలు పెరుగుతాయనే భయాలతో మార్కెట్లు కుదేలైంది. సెన్సెక్స్ 689.78 పాయింట్లు క్షీణించి 55557.50 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇక నిఫ్టీ 165.10 పాయింట్లు నష్టపోయి 16628.80 వద్ద ముగిసింది. డాలరు విలువ రూపాయి మారకంతో పోలిస్తే 75.71 వద్ద ముగిసింది.