Devi Sri Prasad: దేవి శ్రీ ప్రసాద్ ఐటమ్ సాంగ్ కి, దేవుడి సాంగ్ కు మధ్య తేడా తెలీదా?

Devi Sri Prasad: దేవి శ్రీ ప్రసాద్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు.ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను తాకలేక పోయాయని చెప్పవచ్చు.ఇకపోతే ఈ సినిమా ఏమో కాని ఈ సినిమాలోని పాటలు మాత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకున్నాయి ముఖ్యంగా ఇందులో ఐటమ్ సాంగ్ అందరినీ ఆకట్టుకున్నప్పటికీ ఈ పాట మాత్రం ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది.

ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఊ అంటావా మావా అనే పాటను ఊ అంటావా స్వామి అంటూభక్తి పాటలతో కలిసి పాడటంతో పెద్దఎత్తున నెటిజన్లు దేవిశ్రీ ప్రసాద్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ తన సినిమాలోని ఐటమ్ పాటలను ఇలా భక్తి పాటలతో కలిపి పాడటం వల్ల హిందూ మతానికి అవమానించినట్లేనని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దేవిశ్రీ ప్రసాద్ కామెంట్ల గురించి స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ దేవిశ్రీప్రసాద్ హిందూ మతస్తుల మనోభావాలను దెబ్బ తీశారు. ఈ క్రమంలోనే ఆయన బహిరంగంగా అందరికీ క్షమాపణలు చెప్పాలి లేదంటే అతనిని తెలంగాణలో తిరగనివ్వము అంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ ఫిర్యాదు చేశారు. ఇలా పుష్ప సినిమా గురించి అందులో పాటలు గురించి బయట ఈ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్న చిత్ర బృందం, దేవిశ్రీప్రసాద్ ఇప్పటివరకు ఏమాత్రం స్పందించలేదు.