ఆ హీరోయిన్ ని నాగార్జున సీక్రెట్ గా కలుసుకునేవాడా?

టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోస్ ఉన్నా కానీ…నాగార్జున అంటే ఒక క్రేజ్ ఉండేది. నాగార్జున అంటే రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉండేది, అలాగే అప్పట్లో నాగార్జున కి చాలా మంది హీరోయిన్ల తో ఎఫైర్ ఉందని ఒక రూమర్ ఉండేది. టబు, రమ్యకృష్ణ, అనుష్క లాంటి హీరోయిన్స్ తో నాగార్జున బాగా చనువుగా ఉండడం తో వాళ్ళ మధ్య ఏదో ఉందని మీడియా లో తరచూ వినపడుతూ ఉండేది.

హీరోయిన్ ఎవరైనా నాగార్జున అంటే పడి చస్తుంటారని టాక్ ఉంది. టాలీవుడ్ హీరోయిన్స్ తో పాటు అప్పట్లో ఒక బాలీవుడ్ హీరోయిన్ తో నాగార్జున కి సీక్రెట్ ఎఫైర్ ఉందని టాక్ ఉంది. అంతే కాదు ఆమెను కలుసుకోవడానికి నాగార్జున సీక్రెట్ గా ముంబై కూడా వెళ్ళేవాడంట.

ఇంతకీ ఆమె ఎవరంటే….మాజీ మిస్ యూనివర్స్ సుష్మిత సేన్. ‘రక్షకుడు’ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరు ప్రైవేట్‌గా కలిసుకునేవారని… మరీ తప్పనిసరిగా కలుసుకోవాలంటే నాగ్ సీక్రెట్‌గా ముంబైకే వెళ్ళేవారని అప్పట్లో ప్రచారం జరిగింది.

మిస్ యూనివర్స్ విన్ అయిన తొలి రోజుల్లో సుస్మిత‌ జోయ్ అలుకాస్ జువెల్లరీ యాడ్ ఫిలింలో నటించింది. హైదరాబాద్ ఈ యాడ్ షూట్ కోసం వచ్చింది సుస్మిత సేన్. అప్పట్లో తనకున్న క్రేజ్ కారణంగా పెద్ద పెద్ద వీఐపీలకు కూడా అనుమతి ఇవ్వలేదట. కానీ, రిక్వెస్ట్ చేస్తే ఒక్క నాగార్జున ఆమెతో మాట్లాడేందుకు ఓ గంట మాత్రమే కలుసుకునే ఛాన్స్ ఇచ్చారట. ఆ గంట నాగార్జున – సుస్మితా సేన్ ప్రైవేటుగా కలుసుకొని మాట్లాడుకున్నారట.

అయితే ఆ తర్వాత నాగార్జున, సుష్మిత సేన్ లు కలిసి నటించలేదు. అలాగే, సుష్మిత సేన్ కూడా సినిమా కెరీర్ మీద అంతగా ఆశక్తి చూపలేదు. కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత చాలా కాలం సిఎంమాలకు దూరంగా ఉంది సుష్మిత.