Devi Sri Prasad: రెమ్యునరేషన్ పెంచేసిన దేవిశ్రీ..పవన్ సినిమాకు ఎంత తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Devi Sri Prasad: దేవిశ్రీప్రసాద్ టాలీవుడ్ లో ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలు కూడా ఆయన పాటలకు చిందులేస్తారు. దేవి సినిమా ద్వారా తన కెరీర్ ప్రారంభించిన దేవిశ్రీ ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. చిన్న వయసు నుండే ఆయన ఎన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఇటీవల పుష్ప సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఎవరి నోట చూసిన పుష్ప సినిమాలోని పాటలే. సుకుమార్ -దేవిశ్రీ -బన్నీ కాంబినేషన్లో వచ్చిన ఆర్య సినిమా కూడా మ్యూజికల్ గా హిట్ సాధించింది. మరీ ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది.

ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ హరీశ్శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘భగవతీయుడు భగత్ సింగ్ ‘అని సినిమాకు సంగీతం అందిస్తున్నారు.దేవిశ్రీ పవన్ కళ్యాణ్ నటించిన ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు. జల్సా, గబ్బర్ సింగ్ సినిమాలోని పాటలు ఇప్పటికీ అందరూ ఇష్టంగా వింటుంటారు. గబ్బర్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ మొదటిసారిగా దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు దేవి శ్రీ సంగీతాన్ని అందించారు.

ప్రస్తుతం ఈ ముగ్గురి కొంబినేషన్లో మరొకసారి “భగవతీయుడు భగత్ సింగ్” అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్నో హిట్ సాంగ్స్ నీ అందించిన దేవీ శ్రీ ఈ సినిమాకి పారితోషికం పెంచేశాడు అని చిత్ర పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని చిత్ర యూనిట్ ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కోసం దేవిశ్రీ 5 కోట్ల రూపాయల తీసుకుంటున్నారని ఫిల్మ్ ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే దేవిశ్రీ ఇప్పటి వరకు తీసుకున్న అత్యధిక పారితోషికం ఇదే అని చెప్పవచ్చు. ఈ విషయం అంతవరకు నిజం అన్న సంగతి తెలియాలంటే కొన్ని రోజుల వేచి చూడాల్సిందే.