ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కరవు భత్యం (డీఏ) 3శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డీఏ, పెన్షనర్లకు ఇచ్చే డీఆర్‌ను 3శాతం పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం అమోదం తెలిపింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగల డీఏ 31 శాతంగా ఉండగా.. తాజా నిర్ణయంతో అది 34 శాతానికి చేరింది. జనవరి 1, 2022 నుంచే ఈ పెంపు అమల్లోకి రానుంది