Director Maradhuri Raja: దాసరి గారు 11గంటలకు వచ్చి నా సినిమా ఆయనకు కావాలన్నారు: డైరెక్టర్ మరుధూరి రాజా

Director Maradhuri Raja: తాను రచనలు చేస్తూ డైరెక్టర్‌గా మారానని, అంతే కాకుండా తనను అప్పట్లో సినిమాల్లో నటించమని చాలా మంది అడిగారని, అందులో ఈవీవీ గారు కూడా ఉన్నారని ప్రముఖ సినీ దర్శకుడు మరుధూరి రాజా తెలిపారు. కానీ తాను నటించలేదని, సమయం వచ్చినపుడు చేస్తానని ఆయన చెప్పినట్టు రాజా చెప్పారు.

అయితే ఓ సినిమా దాసరి గారు చూసి ఆయననే రిలీజ్ కూడా చేస్తానని అన్నారని మరుధూరి రాజా చెప్పారు. ఆయన చెప్పిన కొన్ని సిస్టమ్స్ తమ ప్రొడ్యూసర్‌కి నచ్చలేదని రాజా చెప్పుకొచ్చారు. దాసరి గారు సినిమా చూసి 11 గంటలకు వచ్చి, భలే సినిమానయ్యా, చాలా బాగా తీశావ్ అని చెప్పినట్టు ఆయన తెలిపారు. ఆ తర్వాత తన దగ్గరికొచ్చి ఏదేమైనా సరే ఆ సినిమాను మనమే రిలీజ్ చేస్తున్నామని కూడా దాసరి తనతో చెప్పినట్టు ఆయన అన్నారు.

ఆ సమయంలో దాసరి గారు చెప్పిన కొన్ని విషయాలు, ప్రొడ్యూసర్‌కి నచ్చలేదని మరుధూరి రాజా అన్నారు. కానీ ఒకవేళ దాసరి గారు చెప్పిన పద్ధతులు పాటిస్తే బాగుండేదని ఆయన వాపోయారు. కానీ అవి కేవలం ప్రొడ్యూసర్‌కి నచ్చలేదన్న కారణంతో సరిగా రిలీజ్ కాలేదని ఆయన చెప్పారు. లైఫ్‌లో ఎప్పుడూ ఎవరూ సహాయం చేయలేదు, నేనే పైకొచ్చానని చెప్పే వాళ్లను చూస్తే తనకు చాలా కోపం వస్తుందని ఆయన అన్నారు. ఎందుకంటే సహాయం చేసే వారు ఉన్నా కూడా అందుకోలేకపోవడం నిజంగా దురదృష్టమేనని ఆయన తెలిపారు. ఇండస్ట్రీలో అలా సహాయం చేయడానికి చాలా మంది ఉంటారని, కానీ అవి మనం అందుకుంటున్నామా లేదా అనేదే ప్రశ్న అని ఆయన అన్నారు. అలా దాసరి గారు చేయందించారు గానీ, తానే అందుకోలేకపోయానని ఆయన వాపోయారు. ఆ విషయంలో తాను ఇప్పటికీ ఆయన్ని తలచుకుని బాధపడతానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.