మ‌నం త‌రహాలో త్వ‌రలో ద‌గ్గుబాటి ఫ్యామిలీ మూవీ !

త‌మిళ ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున తెర‌కెక్కించిన మ‌నం చిత్రం ఎంత పెద్ద హిట్టైందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఫ్యామిలీ ఎమోష‌న‌ల్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, నాగార్జున‌, నాగ చైత‌న్య‌, అఖిల్, స‌మంత ఇలా అక్కినేని ఫ్యామిలీకి చెందిన వారంతా మ‌నం చిత్రంలో క‌నిపించారు. ఈ చిత్రం అక్కినేని కుటుంబానికే కాక ప్రేక్ష‌కుల‌కి కూడా మెమోర‌బుల్ మూవీగా మారింది. ఇప్పుడు ఇలాంటి సినిమా కోసం మెగా ఫ్యామిలీ, ద‌గ్గుబాటి ఫ్యామిలీలు కొన్నేళ్లుగా ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.

తాజాగా ద‌గ్గుబాటి ఫ్యామిలీ కోసం మంచి క‌థ సిద్ద‌మైన‌ట్టు తెలుస్తుండగా, ఇందులో వెంక‌టేష్‌, రానా,నాగ చైత‌న్య క‌లిసి న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. ద‌గ్గుబాటి వార‌సులు క‌లిసి ఓ సినిమాలో క‌నిపించాల‌ని ప్ర‌ముఖ నిర్మాత రామానాయుడు క‌ల కాగా, దీనిని సాకారం చేసేందుకు సురేష్ బాబు ముందుకు వ‌చ్చిన‌ట్టు టాక్. ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న ఇటీవ‌ల కుటుంబ క‌థ‌ని సిద్ధం చేసి సురేష్ బాబు కి వినిపించాడ‌ట‌. ఇది త‌న‌కు ఎంత‌గానో న‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. అయితే హీరోలెవ‌రు ఈ క‌థ‌ని విన‌లేద‌ట‌. త్వ‌ర‌లో వారికి క‌థ వినిపించి సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు స‌తీష్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

‘శతమానం భవతి’ లాంటి కుటుంబ కథా చిత్రంతో జాతీయ పురస్కారం సొంతం చేసుకున్న సతీష్ వేగేశ్న ప్రస్తుతం ‘కోతి కొమ్మచ్చి’ అనే చిత్రం చేస్తున్నారు. ఇందులో శ్రీహ‌రి త‌న‌యుడు న‌టిస్తున్నాడు . ఈ సినిమా పూర్తైన త‌ర్వాత దగ్గుబాటి కుటుంబ కథానాయకుల సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంది. కాగా, 2019లో మామా అల్లుళ్లు వెంకటేష్‌ – నాగచైతన్య కలిసి ‘వెంకీమామ’ చేశారు. ప్ర‌స్తుతం వెంకీ నారప్ప చిత్రంతో పాటు ఎఫ్ 3 అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. రానా అర‌ణ్య‌, విరాట ప‌ర్వం చిత్రాలు చేస్తున్నాడు.