పునాదిరాళ్లు సినిమా ద్వారా తన సినీ ప్రయాణం మొదలు పెట్టిన చిరంజీవి అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో టాప్ హీరోగా గుర్తింపు పొందాడు. ఆయన నటించిన ఎన్నో సినిమాలకు అవార్డులు కూడా దక్కాయి. 60 పదుల వయసు దాటినా కూడా ఇండస్ట్రీలో ఆయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఆయన కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు తీస్తున్నాడు. కొంతకాలం రాజకీయాల వల్ల సినిమాలకు విరామం ఇచ్చిన చిరంజీవి మళ్లీ ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.
అప్పటినుండి చిరంజీవి వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇటీవల చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా విడుదలైంది. ఈ సినిమా ఊహించినంత హిట్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం చిరంజీవి
‘బోళా శంకర్’ , ‘ వాల్తేరు వీరయ్య ‘ వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి తన సినిమాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక హీరో తనకి సెట్ అయ్యే కథనే సెలెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆయన విన్న కథలు తన కన్నా తోటి హీరోలకు బాగుంటాయి అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకి ఆనయ నటించిన “డాడీ” సినిమా.
ఈ సినిమా స్టోరీ విన్నప్పుడు ఈ కథ నాకన్నా వెంకటేష్ కి బాగా సెట్ అవుతుంది అని చెప్పాను. కానీ భూపతి రాజు ఈ కథ మీకైతే ఫ్యామిలీమెన్గా వెరైటీగా ఉంటుంది’ అని నన్ను ఒప్పించారు. అయినా నేను కొంచం సందేహంగా ఉన్నప్పటికీ కథ విన్న వారందరూ ‘చిన్న పాపతో సినిమా కాబట్టి మీకు బాగుంటుంది’ అని నన్ను ఒప్పించారు. చివరకు సినిమా విడుదలైన తర్వాత నేననుకున్నదే జరిగింది. ఈ సినిమ చూసిన తర్వాత వెంకటేశ్ నాకు ఫోన్ చేసి ‘భలే సినిమా అండీ. ఈ సినిమా నా మీద అయితే ఇంకా బాగా ఆడేది’ అని అన్నాడు. అప్పుడు ఈ సినిమా నీకైతే బాగుండేదని నేను కూడా చెప్పాను కానీ వినలేదు’ అని అన్నాను. ఇలా అప్పట్లో ఆ సినిమా విషయంలో జరిగిన విధంగా కొన్ని పొరపాట్లు నా జీవితంలో ఉన్నాయి అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.
