క్రేజీ టాక్ : ‘RRR’ పార్ట్ 2 కి రాజమౌళి స్టోరీ లైన్ ఇదేనా.?

దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ఎన్నో భారీ బ్లాక్ బస్టర్స్ లో లేటెస్ట్ భారీ హిట్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి. బాహుబలి లాంటి ఇండియన్ ఇండస్ట్రీ హిట్ బాహుబలి 2 తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడా అని ఒక సంచలన కలయిక యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో స్టార్ట్ చేసి ఇండియా వైడ్ అటెన్షన్ ని అయితే రాజమౌళి సెట్ చేసి పెట్టాడు.

ఇక ఇద్దరినీ పెట్టి ఎలాంటి సినిమా చేస్తాడు అసలు కథ ఎలా ఉంటుంది ఎవరు హైలైట్ అవుతారు అనే అంశాలు పెద్ద ఎత్తున చర్చకు రాగా తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక అంతా సెట్టయ్యింది. అయితే బాహుబలి లానే ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఉంటుంది అని డైరెక్ట్ గా సినిమాలో ఎక్కడా రివీల్ చెయ్యలేదు.

కానీ తర్వాత RRR కి పార్ట్ 2 ఉండొచ్చని స్వయంగా సినిమా రచయితా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంపై సీక్వెల్ కథ ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఓ క్రేజీ టాక్ వైరల్ గా మారింది. ఈసారి కథ ఎలా ఉంటుంది అంటే మళ్ళీ భీం మరియు అల్లూరి లు ఒకరికొకరు ఎదురు తిరగడం అనే కోణం లోనే ఉంటుందట.

మెయిన్ గా అయితే ఇద్దరి మధ్య ఘర్షణ పాయింట్ మీదే సినిమా ఉంటుంది అని అంటున్నారు. మరి ఆల్రెడీ ఇద్దరూ స్నేహితులుగా కలిసిపోయారు. మళ్ళీ ఇద్దరి మధ్య యుద్ధం అంటే మధ్యలో మరో బలమైన కారణం తప్పక ఉండి తీరాలి. మరి ఇదంతా ఎప్పుడుకి జరుగుతుందో ఏంటో.