విశాఖ బ్రేకింగ్.. హిందుస్తాన్ షిప్‌యార్డ్‌లో ఘోర ప్ర‌మాదం..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విశాఖపట్నం జిల్లాలో మ‌రో ఘోర‌ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంస్థ హిందుస్తాన్ షిప్ యార్డులో జ‌రిగిన క్రేన్ ప్ర‌మాదంలో ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు. అస‌లు విష‌యంలోకి వెళితే.. షిప్ యార్డ్‌కు చెందిన ఓ భారీ క్రేన్‌తో ట్ర‌య‌ల్ ర‌న్ నిర్వ‌హిస్తుండ‌గా, ఒక్క‌సారిగా అది కూలిపోయింది. దీంతో అక్క‌డ ప‌ని చేస్తున్న కార్మికుల మీద‌, ఆ భారీ క్రేన్ విరిగిప‌డ‌డంతో, కొంద‌రు కార్మికులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా, మ‌రికొంద‌రికి తీవ్రంగా గాయ‌ప‌డ‌డంతో వారిని వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వారి ప‌రిస్థితి కూడా విష‌మంగా ఉంద‌ని స‌మాచారం.