మెట్రో ప్రయాణికులకు మరో గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు మరో గుడ్‌ న్యూస్‌. మెట్రో రైళ్ల వేగం పెంచేందుకు CMRS‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గంటకు 80 కి.మీ నుంచి 90 కి. వరకు స్పీడ్ పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి 28,29,30 తేదీల్లో మెట్రో రైలు స్పీడ్‌, సెక్యూరిటీపై సంబంధించిన నిబంధనలను అధికారులు పరిశీలించారు. తనిఖీల అనంతరం కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైల్వే సేఫ్టీ సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో స్పీడ్‌ను పెంచుకునేందుకు అనుమతించింది.