గుండె ముక్కలయిందంటూ.. ఆ పాటను తలచుకొని కేకే మృతికి సంతాపం తెలిపిన చిరు!

ప్రముఖ గాయకుడు కృష్ణ కుమార్ అకాల మరణం సంగీత ప్రేమికులను శోకసంద్రంలోకి నెట్టింది. ఈ క్రమంలోనే ఆయన మరణవార్త విన్న ఎంతోమంది ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ షాక్ కి గురయ్యారు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు కేకే మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అతనితో వారికి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. కేకే పలు భాషలలో ఎన్నో వందల పాటలు పాడుతూ శ్రోతలను ఉర్రూతలూగించారు.

తాజాగా ఆయన చనిపోయే ముందు వరకు కూడా ఒక సంగీత వేడుకలో పాల్గొని పెద్ద ఎత్తున పాటలు పాడుతూ అందరినీ సందడి చేశారు. ఇకపోతే ఈయన గుండెపోటుతో మరణించడంతో ఈయన మృతి పై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ తన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తన ఆత్మ శాంతించాలని కోరుకున్నారు. ఇలా కేకే మరణవార్త వినగానే గుండె ముక్కలైందని మెగాస్టార్ పేర్కొన్నారు.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలో దాయి దాయి దామ్మా పాట ఎంత ఫేమస్ అయ్యిందో మనకు తెలిసిందే.

ఈ పాటను కేకే పాడిన విషయాన్ని ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గుర్తుచేసుకుంటూ అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ట్విట్టర్ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక ఈయన మరణ వార్త పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సంతాపం తెలియజేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ సైతం ఈయన మరణవార్త తెలిసి నివాళులు అర్పించారు.