20 రోజుల పాటు మలేషియాలో బస చేయనున్న చిరంజీవి.. ఆ సినిమా షూటింగ్ కోసమే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఇటీవల విడుదలైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. అయితే అనుకున్న స్థాయిలో ఈ సినిమా సక్సెస్ సాధించలేకపోయింది. చిరంజీవి ప్రస్తుతం తన తర్వాత సినిమాలో షూటింగ్ పనులలో చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే చిరంజీవి భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలలో నటిస్తున్నాడు.

ప్రస్తుతం చిరంజీవి 20 రోజులపాటు మలేషియా వెళ్ళటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య సినిమా లో చిరంజీవి నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడీగా అందాల నటి శృతి హాసన్ నటించనుంది. ఇప్పటికే 30 శాతం షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళవలసి ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్ కోసం మొత్తం సినిమా యూనిట్ మలేషియాకు ఉన్నారు.

మలేషియాలో జరిగే షూటింగ్ ఈ సినిమాకు చాలా కీలకమని సమాచారం. వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ కోసం సినిమా యూనిట్ జూన్ మొదటి వారంలో కాని రెండవ వారంలో లో కానీ మలేషియాకు పయనం కానున్నారు. ఇప్పటికి మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం దాదాపు 20 రోజుల పాటు మాయేషియలో షూటింగ్ జరగనుంది. ఈ సంధర్భంగా చిరంజీవి తన మలేషియ ట్రిప్ కి రెడీ అవుతున్నట్లు సమాచారం. కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని జీకే మోహన్, ఎమ్‌ ప్రవీణ్‌ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.