Chiranjeevi: అమరావతి పునర్నిర్మాణం… ప్రధాని సభకు దూరంగా మెగాస్టార్ చిరు…. ఇదే కారణమా?

Chiranjeevi: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని లక్ష్యంగా అమరావతి పనులను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతులు మీదుగా ఈయన మరోసారి పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు రాబోయే మూడు సంవత్సరాలలో రాజధాని నిర్మాణం చేపడతామని రాజధాని నిర్మించిన తరువాతనే సార్వత్రిక ఎన్నికలకు వెళ్తాము అంటూ చంద్రబాబు నాయుడు తెలియజేశారు.

ఇలా ఈ అమరావతి పునర్నిర్మాణ పనులు ఎంతో ఘనంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరవుతారని భావించారు కానీ చిరంజీవి మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. అయితే చిరంజీవి మోడీ సభకు దూరంగా ఉండడానికి గల కారణం ఏంటనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరి మోడీ సభకు చిరంజీవి రాకపోవడానికి గల కారణమేంటనే విషయాన్నికి వస్తే…

వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకోవచ్చారు అయితే ఈ మూడు రాజధానుల ప్రతిపాదనకు అప్పట్లో చిరంజీవి కూడా సానుకూలంగా స్పందించారు.అమరావతి కోసం రైతుల నుంచి భూ సేకరణ సరి కాదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. దీంతో, ఇలాంటి వ్యక్తిని అమరావతి వేడుకకు ఎలా పిలుస్తారనే ప్రశ్నలు సోషల్ మీడియాలో కనిపించాయి. అమరావతి సభకు చిరంజీవి రాకపోవటం పైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక ఈ వేడుకకు చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం వచ్చినా కూడా ఈయన హాజరు కాలేదు అయితే ఇందుకు ప్రధాన కారణం..ముంబాయిలో జరిగిన వేవ్స్ సదస్సు లో చిరంజీవి పాల్గొన్నారు. ఇలా చిరంజీవి ఈ వేవ్స్ సదస్సుకు వెళ్లడం వల్లే అమరావతికి రాలేదని తెలుస్తుంది అంతేకాకుండా చిరంజీవి హాజరైతే లేనిపోని రాజకీయ వివాదానికి తెరలేపినట్టు అవుతుంది అందుకే చిరంజీవి ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది.