Chiranjeevi: తాజాగా అల్లు కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ తల్లి అలాగే దివంగత నటుడు అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ తాజాగా తుది శ్వాస విడిచారు. అయితే గొంత కాలంగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నేడు శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. దీంతో సినీ ప్రముఖులంతా అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి ఆమెకు నివాళులు అర్పించారు.
చిరంజీవికి సురేఖను ఇవ్వడంతో అల్లు కనకరత్నమ్మ ఆయనకు అత్తమ్మ అవుతుందని తెలిసిందే. దీంతో నేడు ఆమె అంత్యక్రియలు కూడా చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇవాళ ఉదయం నుంచి చిరంజీవి అక్కడే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి తన అత్తమ్మ పాడెను కూడా మోశారు. ఒకవైపు చిరంజీవి పట్టుకోగా మరోవైపు నానమ్మ పాడె ని అల్లు అర్జున్ మోశారు.

అలాగే అల్లు అర్జున్ కొడుకు కూడా పాడేను పట్టుకున్నాడు ఇలా మామ అల్లుళ్ళు కలిసి అల్లు కనకరత్నమ్మ పాడె మోయడంతో ఈ విజువల్స్ వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో వీడియోలు చూసిన మెగా అభిమానులు, అల్లు అభిమానులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
