Chiranjeevi: చిరిగిన బట్టలతోనే పెళ్లి పీటల పై కూర్చుని సురేఖ మెడలో మూడు ముళ్లు వేసిన మెగాస్టార్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత వరస ప్రాజెక్టులతో నేటి హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ ను పునాదిరాళ్లు సినిమాతో ప్రారంభించారు. ఈ విధంగా పునాదిరాళ్లతో ప్రారంభమైన తన కెరీర్ నేటి వరకు కొనసాగుతూ ఎంతో అద్భుతమైన విజయాలను అందుకొని విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు. ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవిగా కొనసాగుతున్న సమయంలో నటుడు అల్లు రామలింగయ్య తన కూతురు సురేఖని ఇచ్చి వివాహం చేసిన సంగతి తెలిసిందే.

ఈవిధంగా 1980 ఏప్రిల్ 20వ తేదీ వీరి వివాహం జరిగింది. ఈ విధంగా చిరంజీవి సురేఖ వివాహం నిశ్చయం చేసిన విషయం తెలియడంతో ఎంతో మంది మెగాస్టార్ చిరంజీవికి సురేఖని ఇచ్చి వివాహం చేయొద్దని చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మా పెళ్లి సమయంలో తాతయ్య ప్రేమ లీలలు అనే సినిమాల్లో నటిస్తున్నానని,నూతన ప్రసాద్ బిజీ షెడ్యూల్ కారణంగా పెళ్లిని వాయిదా వేసుకోవాలని భావించగా నిర్మాత షూటింగ్ వాయిదా వేయడంతో యధావిధిగా పెళ్లి జరిగిందని తెలిపారు.

అప్పట్లో చాలామంది ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నం చేశారు కానీ రామలింగయ్య చిరంజీవిలో ఉన్న ప్రతిభను గుర్తించి ఎప్పటికైనా గొప్ప నటుడు అవుతారని భావించి తన కూతురిని ఇచ్చి వివాహం చేశారని తెలిపారు. ఇకపోతే వీరి వివాహ సమయంలో పెళ్లి పీటల పై కూర్చున్న సమయంలో చిరంజీవి చొక్కా చినిగిపోయిందని ఇదే విషయం తనతో చెప్పి బట్టలు మార్చుకోవాలని సూచించారు. చినిగిపోయిన చొక్కాలో తాళికట్టలేనా అని చెప్పి అదే చొక్కాతో సురేఖ మెడలో మూడుముళ్లు వేశానని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.