ఒంటరి అయిపోతున్న మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి అంటే ఎనలేని క్రేజ్. ఇప్పటికి కూడా చిరంజీవి కి ఉన్నంత క్రేజ్ మరే టాలీవుడ్ హీరోకి లేదు అనడం లో సందేహం లేదు. ఒక్కవిధంగా చెప్పాలంటే టాలీవుడ్ లో చిరంజీవి నే ఆఖరి నెంబర్ వన్ హీరో.

అయితే ఈ మధ్య చిరంజీవి సినిమాలు అంత గా ఆడడం లేదు. ‘సైరా’, ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ సినిమాలు చిరంజీవి రేంజ్ కి ఏమాత్రం సరిపడేలా ఆడలేదు. పాలిటిక్స్ లో అనుకున్నంత సక్సెస్ అవ్వని చిరంజీవి మళ్ళీ సినిమాల్తో బిజీ అయిపోతున్నాడు.

ఒకప్పుడు చిరంజీవి కి ఎంతో సన్నిహితంగా ఉండే అల్లు అరవింద్ కూడా ఇప్పుడు చిరంజీవి ని సైడ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి వెళ్లి జగన్ ను కలిసిన దగ్గర నుంచి ఆయనను విపరీతంగా ట్రోల్ చేసారు. ఈ ట్రోలింగ్ ఎవరు చేసారు? వెనుక ఏ రాజకీయ పార్టీ వుందన్నది బహిరంగ రహస్యం.

‘ఆహ’ లో ‘అన్ స్టాపబుల్ ‘ టాక్ షో కి చిరంజీవిని పిలుద్దాం అంటే బాలయ్య వద్దని చెప్పాడని సమాచారం. చిరంజీవి  అంటే సరిపడదు నందమూరి బాలయ్యకు అన్నది టాలీవుడ్ లో ఓపెన్ టాక్.

అయితే ‘ఆహ’ లో అన్ని ప్రోగ్రామ్స్ అల్లు అరవింద్ పర్మిషన్ తోనే జరుగుతాయి. అలాంటిది చిరంజీవి ని పక్కన పెట్టడం వెనక అల్లు అరవింద్ హస్తం కూడా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కానీ ఆ షో కి పవన్ కళ్యాణ్ ని మాత్రం పిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. తనను ట్రోలింగ్ చేయించిన వారితో పొత్తులు పెట్టుకుని, చేతులు కలుపుకుని చెట్టాపట్టాలు వేస్తుంటే మెగాస్టార్ చిరు ఒంటరి అయిపోతున్నట్లు అనిపిస్తుంది.