తెలంగాణలో అమెరికాకు చెందిన కాల్ అవే గోల్ఫ్ కంపెనీ పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాద్లో డిజిటెక్ సెంటర్ ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో కాల్ అవే గోల్ఫ్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక టాప్ గోల్ఫ్ బ్రాండ్గా ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న కాల్ అవే.. హైదరాబాద్లో నూతన డిజిటెక్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇందులో కొత్తగా 300 మంది ఐటీ ప్రొఫెషనల్స్పని చేయనున్నారు
తెలంగాణలో అమెరికా కంపెనీ భారీ పెట్టుబడులు..!
