బ్రేకింగ్ న్యూస్ : సీఎం జగన్ ఇంట్లో విషాదం

ec gangireddy telugu rajyam

 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సీఎం జగన్ భార్య వైఎస్ భారతి తండ్రి, ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. గత కొద్దీ రోజులు అనారోగ్యంతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

ec gangireddy telugu rajyam

 

 మృతదేహాన్ని పులివెందుల తరలించారు. ఆయన స్వగ్రామం కడప జిల్లా వేముల మండలం గొల్లలగూడూరు లో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్న అంత్యక్రియలకు సీఎం జగన్ హాజరయ్యే అవకాశం వుంది. రాజకీయాల్లో గంగిరెడ్డి కి ప్రవేశం వుంది, 2001 నుండి 2005 దాక పులివెందుల ఎంపీపీ గా పని చేసిన అనుభవం ఆయన సొంతం. 2003 లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుండి కడప కలెక్టరేట్ వరకు గంగిరెడ్డి పాదయాత్ర చేశారు. అల్లుడు సీఎం అయినా కానీ తాను చేస్తున్న వృత్తిని వదిలిపెట్టకుండా, దానిలో కొనసాగుతూ మంచి హస్తవాసి కలిగిన డాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.