బీజేపీకి దెబ్బ మీద దెబ్బ…కటీఫ్ చెప్పిన నేషనల్ పీపుల్స్ పార్టీ

BJP-NPP political crisis

బీజేపీ పార్టీ పతనం ప్రారంభమైందా! పరిస్థితులు గమనిస్తున్న వారందరికీ వస్తున్నఅనుమానం ఇది. అసలు విషయం ఏంటంటే… ఇప్పటికే వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఏన్డీఏ నుంచి అకాలీదళ్ పార్టీ వైదొలిగి బీజేపీకి షాక్ ఇవ్వగా.. తాజాగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) కూడా బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. దీంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో బీజేపీ సంకీర్ణ సర్కార్ కూలిపోయే దశలో ఉంది.

BJP-NPP political crisis
bjp-npp alliance is broken

బీజేపీ – ఎన్పీపీ కూటమి కలిసి మణిపూర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎం బీరేన్ సింగ్ తాజాగా కేబినెట్ ప్రక్షాళన చేపట్టారు. ఎన్పీపీకి చెందిన ఇద్దరు మంత్రులను పదవుల నుంచి తొలగించడంతో ఇప్పుడా పార్టీ ఎన్డీఏ నుంచి తప్పుకునే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో మణిపూర్ లో సర్కార్ పడిపోతుందని విశ్లేషకులు అంటున్నారు.

మొత్తం 60మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీకి 18మంది ఎమ్మెల్యేలున్నారు. ఎన్పీపీకి 4 – ఎన్.పీ.ఎఫ్ 4 – ఎల్జీపీ 1 – ఇండిపెండెంట్లు 2 మద్దతుతో ఎన్డీఏ సర్కార్ ను ఏర్పాటు చేసింది.

అయితే సీఎం బీరేన్ సింగ్ ఏకపక్ష పోకడలను నిరసిస్తూ ఎన్పీపీ తన మద్దతును వెనక్కి తీసుకుంది. అమిత్ షా మరియు జేపీ నడ్డాలు రంగంలోకి దిగి ఎన్పీపీ నేతలను బుజ్జగించి తిరిగి సీఎం బీరేన్ కు మద్దతు పలికేలా చేశారు.

కానీ తాజాగా కేబినెట్ ప్రక్షాళనలో ఫిరాయింపుదారులకు చోటు కల్పించి ఎన్పీపీ ఇద్దరు మంత్రులను సీఎం తొలగించడంతో మళ్లీ ప్రభుత్వం పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ తమను మోసం చేస్తుందని ప్రభుత్వం నుంచి వైదొలగడానికి ఎన్పీపీ రెడీ అయ్యింది.