హైకోర్టును ఆశ్రయించిన భాజపా ఎమ్మెల్యేలు

తెలంగాణ భాజపా ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా తమను సస్పెండ్ చేశారని ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు . అసెంబ్లీ సమావేశాల్లో తమను అనుమతిచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని భాజపా ఎమ్మెల్యేలు విన్నవించారు. శాసన సభలో బడ్జెట్​ప్రసంగానికి అడ్డుపడుతున్నారని.. భాజపా సభ్యులు ఈటల రాజేందర్​, రఘునందర్​రావు, రాజాసింగ్.. వారిని సభ నుంచి సస్పెండ్​ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ దానిని ఆమోదించింది.