AP: జగన్ నువ్వు రాజకీయాలలోనే లేకుండా చేస్తాం… వార్నింగ్ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే!

AP: ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అయితే ఎంతోమంది వైసీపీలో గెలిచి మంత్రులుగా కొనసాగిన వారు కూడా తీరా ఎన్నికలకు ముందు కూటమే పార్టీలలోకి వెళ్లే అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించడమే కాకుండా ప్రస్తుతం మంత్రులుగా కూడా కొనసాగుతున్న వారు ఉన్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి పక్షాన ఎన్నికలలో విజయం సాధించిన వారు కూడా ఇప్పుడు ఇతర పార్టీలలోకి వెళ్లి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థిగా మారి ఆయనకే వార్నింగ్ ఇస్తున్నారు.

ఇలా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఆయనకు వార్నింగ్ ఇచ్చినటువంటి వారిలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఒకరు. ఇటీవల కాలంలో ఆదినారాయణ రెడ్డి పెద్ద ఎత్తున వివాదంలో నిలుస్తున్నారు ముఖ్యంగా జెసి దివాకర్ రెడ్డితో యాష్ కోసం గొడవ పడిన విషయం తెలిసిందే. తాజాగా కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలను మామూళ్ల కోసం, కాంట్రాక్టుల కోసం బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆది నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు.

ఈ క్రమంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.వైఎస్ జగన్ ను రాజకీయాల్లో లేకుండా చేస్తామంటూ ఆదినారాయణరెడ్డి హెచ్చరించారు. సిమెంట్ పరిశ్రమల నంచి వైసీపీ నేతలు లబ్ది పొందుతున్నారని, వైసీపీ త్వరలోనే కుప్పకూలిపోతుందంటూ ఆది తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కంటే ఇక్కడ ఉన్న వైసిపి వాళ్లు డేంజర్ అన్నారు.వైసీపీకి ఈసారి 11 సీట్లు కూడా రావన్నారు. జగన్ కోరికలేవీ నెరవేరవని ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. లిక్కర్ కేసులో కసిరెడ్డి దొరికాడని, జగన్ సహా అందరి బండారం బయటపడుతుందన్నారు. చెట్టే రాలిపోతుంటే ఇక ఆకులు, ఈకలు ఏం ఉంటాయంటూ జగన్మోహన్ రెడ్డి గురించి ఆదినారాయణ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.