బోణీ కొట్టిన బీజేపీ.. మరో 36 స్థానాలలో ఆధిక్యం?

bjp first victory in adikmet in ghmc elections

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటికే తొలి రౌండ్ అయిపోయింది. రెండో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది.

bjp first victory in adikmet in ghmc elections
bjp first victory in adikmet in ghmc elections

అన్ని పార్టీల కంటే ముందు ఎంఐఎం బోణీ కొట్టగా.. తర్వాత టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. బీజేపీ మాత్రం ఇప్పుడే బోణీ కొట్టింది.

ప్రస్తుతానికి బీజేపీ పార్టీ 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా… మూడు డివిజన్లలో గెలిచింది. అడిక్ మెట్ అభ్యర్థిని సునీతా ప్రకాశ్ గౌడ్ విజయం సాధించారు. ముషీరాబాద్ అభ్యర్థిని సుప్రియ, గచ్చిబౌలి అభ్యర్థి గంగాధర్ రెడ్డి విజయం సాధించారు.

బీజేపీ బోణీ కొట్టినప్పటికీ.. మొత్తం మీద చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 13 స్థానాల్లో గెలిచింది. 45 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం 17 స్థానాల్లో గెలవగా… 16 స్థానాల్లో గెలిచింది.

ఇక.. కాంగ్రెస్ రెండు స్థానాల్లో బోణీ కొట్టింది. ఏఎస్ రావు నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శిరీషారెడ్డి విజయం సాధించారు. ఉప్పల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని ఎం.రజిత విజయం సాధించారు.