Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనే సెలబ్రెటీలు వీరే..షో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా?

Bigg Boss Telugu OTT: బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు దాదాపుగా ఐదు సీజన్ లను విజయవంతంగా పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాల్టీ షోగా ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోని నిర్వాహకులు కాస్త వినూత్నంగా ఆలోచించి ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి తొలిసారిగా బిగ్ బాస్ ఓటీటీ ని మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి సెలబ్రిటీలను కూడా ఎంపిక చేశారు. అయితే ముందుగా తమిళంలో ఓటిటి షో తమిళంలో ప్రారంభమైన తరువాత తెలుగులో స్ట్రీమింగ్ కానుంది.

అయితే ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీల పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ షోని ఫిబ్రవరి మూడో వారంలో ప్రారంభించాలి అని నిర్ణయించినట్లు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీల ఎంపిక విషయం ముగింపు దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే సెలబ్రిటీల ఎంపిక విషయం పూర్తి చేసి వారిని క్వారంటైన్ తరలించాలి అని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో సెలబ్రిటీల త్వరగా ఎంపిక చేసి వారిని ఐసోలేషన్ లో ఉంచి బిగ్ బాస్ హౌస్ లోకి పంపే ముందు సూచనలు పాటించాలి అని భావిస్తున్నారు నిర్వాహకులు.

సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం బిగ్ బాస్ ఓటీటీ లో పాల్గొనబోయే కంటెస్టెంట్ లు వీరే. హీరో నవదీప్, వైష్ణవి చైతన్య, మౌనిక రెడ్డి, యాంకర్ వర్షిని, దిల్ సే మహబూబ్, శ్రీహాన్, శ్రీవిద్య, శ్వేతా నాయుడు పలువురు సెలబ్రిటీల ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రారంభ విషయానికి వస్తే తొలి బిగ్ బాస్ తెలుగు ఓటీటీ షో ప్రముఖ ఓటీటీ యాప్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఫిబ్రవరి మూడో వారం అనగా ఫిబ్రవరి 20 తేదీ నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.