Tollywood Celebrities: ఓకే ప్రేమ్ లో బడా స్టార్స్… ఫోటో వైరల్!

Tollywood Celebrities: సాధారణంగా సినిమా సెలబ్రెటీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కనబడితేనే అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు.అలాంటిది స్టార్ హీరోలు డైరెక్టర్లు అందరూ కలిసి ఒకే ఫోటోకి ఫోజులు ఇస్తే ఆ ఫోటో గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం అలాంటి ఫోటోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలో చిరంజీవి మహేష్ బాబు ప్రభాస్ రాజమౌళి కొరటాల వంటి టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఒకే ఫ్రేమ్ లో ఉండడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.

అయితే ఈ బడా స్టార్స్ అందరూ కూడా నేడు విజయవాడలో క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న నేపథ్యంలో ఈ ఫోటో దిగారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఈ ఫోటోని వైరల్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక వీరందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సినిమా టిక్కెట్ల రేట్లపై ఆయనతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే సినిమా టికెట్ల రేట్లు పలు సమస్యలపై ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించనున్నారు.

ఎప్పుడు కలవని ప్రభాస్ మహేష్ బాబు ఈ విధంగా ఒకే చోట కనిపించడంతో అభిమానులు పెద్ద ఎత్తున పండగ చేసుకుంటున్నారు. ఇటు మహేష్ బాబు అభిమానుల సంతోషానికి అటు ప్రభాస్ ఫాన్స్ కు పండగలా ఉందని చెప్పవచ్చు. అయితే వీరందరూ ముఖ్యమంత్రిని కలిసి సినిమా టికెట్ల వ్యవహారం పై ఏ విధంగా చర్చించనున్నారు ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి స్పందన ఏ విధంగా ఉండనుంది అనే విషయం గురించి పెద్ద ఎత్తున ఆతృత ఏర్పడింది.