Balakrishna: నాకు పద్మ భూషణ్ ఇస్తే సరిపోదు… ఆయనకు భారతరత్న ఇవ్వాలి: బాలకృష్ణ

Balakrishna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటీవల పద్మభూషణ్ అవార్డును సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. గత ఐదు దశాబ్దాలుగా బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీకి అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ వచ్చారు. ఇలా ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈయనకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించారు.

ఇటీవల పద్మభూషణ్ అవార్డు అందుకోవడం కోసం ఈయన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఈయన పురస్కారాన్ని అందుకున్నారు. ఈ విధంగా బాలకృష్ణ పద్మభూషణ అవార్డును సొంతం చేసుకోవడంతో చిత్ర పరిశ్రమ కూడా ఈయనని ఘనంగా సత్కరించింది. ఆయనకు నిన్న పౌర సన్మాన సభ నిర్వహిస్తూ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కొన్ని విమర్శలకు కారణమయ్యాయి.

ఈ క్రమంలోనే ఈయన సీనియర్ ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి నేను చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అయితే నాకు పద్మభూషణ్ ఇస్తే సరిపోదనీ, దివంగత నటుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారికి కూడా భారతరత్న ఇవ్వాలని ఈయన కోరారు.

ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇస్తే ఆయనకు గౌరవం ఇచ్చినట్టు కాదు, తెలుగు జాతికి గౌరవం ఇచ్చిన్నట్టు. ప్రతీ తెలుగోడి ఆకాంక్ష, కచ్చితంగా అది త్వరలోనే నెరవేరాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇచ్చినప్పుడే వారికి వాళ్లు గౌరవం ఇచ్చుకున్నట్టు అవుతుందని బాలకృష్ణ ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి అంటూ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ భారతరత్న పురస్కారానికి ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో అర్హుడని అభిమానులు కూడా భావిస్తున్నారు.