Balakrishana: కథ దొరికితే మల్టీస్టారర్ చిత్రంలో నటించడానికి సిద్ధంగా ఉన్నా.. బాలకృష్ణ!

Balakrishana: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా విజయోత్సవంలో ఉన్నారు. బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను సృష్టిస్తోంది కేవలం ఈ సినిమా వారం రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరింది అంటే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు అర్థమవుతుంది. ఇక ఈ సినిమా విజయం సాధించడంతో బాలకృష్ణ మొక్కు తీర్చుకోవడం కోసం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చారు.

అఖండ చిత్ర బృందంతో కలిసి ఆలయానికి చేరుకున్న బాలకృష్ణ అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ అఖండ సినిమా విజయవంతం కావడంతో అమ్మవారి దర్శనం కోసం వచ్చాము అయితే ఈ సినిమా విడుదలకు ముందు చాలా మంది టికెట్ల విషయంలో కంగారు పడ్డారు. ఒకసారి ఆలోచించుకోమ్మని చెప్పారు. అయితే ప్రజలు అభిమానుల పై ఉన్న నమ్మకంతో ఈ సినిమాను విడుదల చేసి ఎన్నో సినిమాలకు ధైర్యం ఇచ్చామని బాలకృష్ణ తెలిపారు.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలకృష్ణ మరిన్ని సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నానని అలాగే తనకు మల్టీస్టారర్ చిత్రంలో నటించాలనే కోరిక ఉందని సరైన కథ, డైరెక్టర్ దొరికితే తప్పకుండా మల్టీ స్టార్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తానని ఈ సందర్భంగా బాలకృష్ణ తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు. ఒకానొక సందర్భంలో డైరెక్టర్ కొరటాల శివ బాలకృష్ణకు సరిపోయే కథ తన దగ్గర ఉందనీ చెప్పడం విశేషం. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ మల్టీస్టారర్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తారని తెలుస్తోంది. అయితే దీని గురించి ఎలాంటి అధికారక ప్రకటన వెలువడలేదు.