Crime News: మద్యం మత్తులో ఉన్న మహిళలపై ఆటో డ్రైవర్ల దారుణం.. నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే..!

Crime News:రాజస్థాన్లోని భరత్ పూర్ లో ఇద్దరు ఆటో డ్రైవర్లు మద్యం మత్తులో ఉన్న యువతిపై దారుణానికి ఒడిగట్టారు. భరత్ పూర్ లో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న 25 సంవత్సరాల వయసున్న మహిళ రోడ్డు మీద ప్రయాణిస్తున్న క్రమంలో ఆటో డ్రైవర్ తో వాగ్వాదం ఏర్పడింది. ఈ క్రమంలో ఆ ఆటో డ్రైవర్ కు మరొక ఆటో డ్రైవర్ తోడై మహిళపై దాడికి పాల్పడ్డారు.

ఈ క్రమంలో చుట్టూ ఉన్న ప్రజలు అంతా ఒకచోట గుమిగూడి వారి గొడవను విడిపించాలని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా చోద్యం చూస్తూ నిలబడ్డారు. అక్కడి గొడవ పెరుగుతుండటంతో కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే ఆటో డ్రైవర్లు ఇద్దరు మహిళలను రోడ్డు మీద పడేసి దారుణంగా ఉన్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని అప్పటికీ వారిని వినిపించకపోవడం గమనార్హం.

ఈ గొడవ కారణంగా దాదాపు గంట సమయం పాటు రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జాం అవడంతో పోలీసులు అక్కడ గుమి కూడి ఉన్న జనాలను పంపించేశారు. ఈ గొడవ జరుగుతున్న క్రమంలో కొంతమంది గొడవ కు సంబంధించి దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోస్టులు ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో ఈ ఘటన గురించి సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను అరెస్టు చేసి మహిళకు తగిన న్యాయం జరిగేలా చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.