Crime News: ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం.. రైల్వే ఉద్యోగి అరెస్ట్..!

Crime News: ఈ రోజుల్లో చాలామంది బంధాలు బంధుత్వాలకి అసలు విలువలు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా కామవాంఛతో లైంగిక దాడులు చేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో ఇటువంటి దారుణం చోటు చేసుకుంది. తన మనవరాలి వయసున్న ఎనిమిదేళ్లు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక నీచుడు. వివరాలలోకి వెళితే.. సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్ లో నివాసముంటున్న వెంకయ్య (53) అనే వ్యక్తి అదే క్వార్టర్స్లో నివాసం ఉంటున్న ఉద్యోగి కుమార్తె అత్యాచారానికి పాల్పడ్డాడు. దాదాపు తన మనవరాలి వయస్సు ఉన్న ఒకటో తరగతి చదువుతున్న బాలికపై ఎవరూ లేని సమయం చూసి అత్యాచారానికి ప్రయత్నించాడు.

రైల్వే క్వార్టర్స్లో నివాసం ఉంటున్న ఉద్యోగికి ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె ఐదో తరగతి చదువగా.. చిన్న కుమార్తె ఒకటో తరగతి చదువుతోంది. కరోనా కారణంగా పిల్లలకు ఆన్లైన్ క్లాసులు ఉండటంతో సోమవారం మధ్యాహ్నం ఆన్లైన్ క్లాస్ ముగించుకొని చిన్న కుమార్తె ఆడుకోవడానికి బయటికి వచ్చింది. రైల్వే క్వార్టర్స్ లో స్లీపింగ్ పనులు చేస్తూ ఉన్న వెంకయ్య ఇదే అదనుగా చూసుకొని చుట్టుపక్కల ఎవరు గమనించకపోవడం ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి రైల్వే క్వార్టర్స్ లో శిథిలావస్థలో ఉన్న ఒక క్వార్టర్స్లోకి ఆ చిన్నారిని తీసుకెళ్లాడు.

ఆ చిన్నారిని అత్యాచారం చేయడానికి అక్కడ ఇక్కడ చేతులు వేస్తూ తకగా చిన్నారి భయంతో పెద్దగా ఏడుస్తూ ,కేకలు వేస్తూ ఉంది. ఇప్పటికే చిన్నారి కనిపించకపోవటంతో ఆమె తల్లిదండ్రులు చిన్నారి కోసం వెతుకుతూ అటు వెళ్లగానే పాడుబడిన క్వాటర్స్ నుండి చిన్నారి అరుపులు వినిపించాయి. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా వెంకయ్య ఆ చిన్నారి పట్ల నీచంగా ప్రవర్తించడం చూసి కోపంతో స్థానికులు అందరూ కలిసి అతడ్ని చితకబాదారు. తోపులాటలో వెంకయ్య వారి నుండి తప్పించుకొని పారిపోయాడు. ఈ ఘటన గురించి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా వెంకయ్య ఫోన్ ట్రేస్ చేసి సిగ్నల్ ఆధారంగా అతనిని గుర్తించి అరెస్టు చేశారు.