కోపంతో ఊగిపోతున్న అనుపమ.. షేమ్ ఆన్ యూ అంటూ పోస్ట్..!

అందాల నటి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎంతో పద్ధతిగా, గ్లామర్ కి దూరంగా ఉంటూ నటిగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రేమమ్ అనే మలయాళం సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనుపమ తెలుగులో నాగైతన్య నటించిన ప్రేమమ్ సినీమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తర్వత శర్వానంద్ హీరోగా నటించిన శతమానం భవతి సినిమా ద్వారా హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. అ ఆ, హలోగురూ ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది.

ఇదిలా ఉండగా సినిమాలతో బిజీగా ఉండే అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. తన అందమైన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు చేరువలో ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు ముఖం మీద చెరగని చిరునవ్వుతో కనిపించే అనుపమ ఈసారి మాత్రం చాలా కోపంగా కనిపిస్తోంది. ఆమె కోపానికి కూడా కారణం ఉందండోయ్. అనుపమ ఇంత కోపంగా ఉండటానికి కారణం కొందరూ వ్యక్తులు.

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వాలు ప్రచారం చేసి చెప్తున్నా కూడా కొందరు వ్యక్తులు మాత్రం చాలా నిర్లక్ష్యంగా చెత్తని ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పడేస్తున్నారు. దీంతో రోడ్డు మీద వెళ్ళేవారు దుర్వాసన వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. అంతే కాకుండా రోడ్ల మీద ఉన్న చెత్త తినటానికి ఆవులు రావటం వల్ల ప్రయాణికులకు అంతరాయం కలుగుతోంది. దీంతో రోడ్డు మీద ఆవులు చెత్త తింటున్న ఫొటోలను అనుపమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..నా గుడ్ మార్నింగ్ రోజూ ఇలాగే మొదలవుతుంది.. ఇంకా ఈ భూమ్మీద ఇలాంటివి చూస్తూ ఈ ప్రకృతిని ఇలా నాశనం చేస్తున్నవారిని చూస్తే నాకు చాలా కోపంగా ఉంది. షేమ్ ఆన్ యు అంటూ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం అనుపమ షేర్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.