చూపు తిప్పుకోలేని అందంతో నెటిజన్స్ కి కట్టిపడేస్తున్న అనసూయ.. ఆహా ఏమి అందం…!

ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట న్యూస్ రీడర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన అనసూయ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన అనసూయ వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకొని నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది. అనసూయ ఒకవైపు టీవీ షో లతోపాటు మరొకవైపు సినిమాలతో నిత్యం బిజీగా ఉంటోంది. బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించిన అనసూయ తన మాటలతో కాకుండా అందాలతో కూడా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే అనసూయ ప్రతివారం ఫోటో షూట్ లతో రచ్చ చేస్తోంది.

సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసి అందమైన ఫోటోలు, వీడియోలు నెటిజన్స్ ని బాగా ఆకర్షిస్తున్నాయి. ఆమె పోస్ట్ షేర్ చేసిన కొన్ని నిమిషాలలోనే మిలియన్ వ్యూస్ వస్తాయి అంటే సోషియల్ మీడియాలో ఆమెకి ఉన్న ఫాలోయింగ్ ఏంటో అర్థమవుతుంది. అనసూయ సోషల్ మీడియాలో చేసే అందాల విందు వల్ల కొన్ని సందర్భాలలో విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇద్దరు పిల్లల తల్లి అన్న విషయం మరచిపోయి పొట్టి బట్టలు వేసుకొని రచ్చ చేస్తోంది అంటూ అనసూయని ట్రోల్ చేశారు. కానీ అనసూయ ఉన్నది గ్లామర్ ఫీల్డ్. ఈ ఫీల్డ్ లో ఇటువంటి అన్ని సాధారణం అంటూ కొట్టిపడేస్తుంది. కానీ కొంతమంది మరి దారుణంగా ట్రోల్ చేయటంతో వారి మీద విరుచుకుపడుతుంది.

అప్పుడు పొట్టి బట్టలు వేసుకొని స్టైలిష్ గా కనిపించే అనసూయ ఇటీవల సంప్రదాయ దుస్తులలో దర్శనమిచ్చింది. భర్త కోసం వట సావిత్రి పూజ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసిన వారు నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటు కామెంట్స్ చేశారు. తాజాగా అనసూయ మళ్ళీ తన అందమైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలలో అనసూయ పింక్ కలర్ డ్రెస్ లో కొంటె చూపులతో అందరినీ ఆకర్షిస్తోంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ బ్యూటిఫుల్, వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అనసూయా ఇలా ప్రతిరోజూ తన అందంతో రోజూ రోజుకి ఫాలోయర్స్ ని పెంచుకుంకుంటుంది.