లేటెస్ట్ టాక్ : “పుష్ప” నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతోందా.?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా “పుష్ప” కోసం తెలిసిందే. సాలిడ్ అంచనాలు ఉన్న ఈ సినిమా ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోగా చిత్ర యూనిట్ మంచి అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. వీటితో పాటుగా సినిమా నుంచి లీక్స్ కూడా ఓ రేంజ్ లో వస్తున్నాయి. మరి ఇదిలా ఉండగా రీసెంట్ టైమ్స్ లో కొన్ని అప్డేట్స్ ని కూడా చిత్ర యూనిట్ ఇస్తున్నారు.

అలా ఇప్పుడు ఇంకో అదిరే అప్డేట్ ని ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే దీపావళి కానుకగా చిత్ర యూనిట్ రిలీజ్ చెయ్యబోతున్నారట. ఆల్రెడీ సినిమాకి తక్కువ సమయమే మిగిలి ఉంది కాబట్టి పెద్ద అప్డేట్ నే వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి ఈ అప్డేట్ ఏంటి అనేది వేచి చూడాలి. ఇక ఈ భారీ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే.