ద‌టీజ్ బ‌న్నీ.. ఆ ఒక్క మాట‌తో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్న నెటిజ‌న్స్

సినిమా ఇండ‌స్ట్రీ అనేది రంగుల ప్ర‌పంచం. ఇందులో ఉన్న క‌ష్ట‌న‌ష్టాలు, ఇబ్బందులు, అవ‌మ‌నాలు అన్నీ ఇన్నీ కావు. వీట‌న్నింటిని దాటుకొని వెళితేనే ఓ పొజీష‌న్‌కు చేరుకుంటాం. ఎవ‌డి తొక్కి పైకి లేద్దామా అనే ఆలోచించే ఈ రోజుల్లో ఎదుటి వాడి మంచి గురించి కూడా ఆలోచించ‌డం అనేది గొప్ప విష‌యం. అది బ‌న్నీ మాట‌ల‌లో క‌నిపించింది. దీంతో ఆయ‌న‌పై నెటిజ‌న్సే కాక ప‌లువురు సినీ ప్రముఖులు కూడా ఆయ‌న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

2020 సంక్రాంతికి అల్లు అర్జున్ అల వైకుంఠ‌పురములో చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా రీసెంట్‌గా ఏడాది పూర్తి చేసుకుంది. ఇందుకు గాను రీయూనియ‌న్ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు, సంగీత దర్శ‌కుడు థ‌మన్, హీరో అల్లు అర్జున్, క‌థానాయిక పూజా హెగ్డేతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. అయితే ఈ వేడుక‌లో మాట్లాడిన బ‌న్నీ 17 ఏళ్ళ‌లో 20 సినిమాలు చేశాక ఆల్ లైం ఫేవ‌రేట్ చిత్రం అల వైకుంఠ‌పుర‌ములో త‌న‌కు ద‌క్కింద‌ని చెప్పి సంతోషం వ్యక్తం చేశాడు.

అలానే త‌న స్పీచ్ ముగించే ముందు అంద‌రికి సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. ఈ సంక్రాంతికి విడుద‌ల‌వుతున్న అన్ని సినిమాల‌ను ఆద‌రించండి, 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్న‌ప్ప‌టికీ జ‌నాలు సేఫ్ గా వ‌చ్చి సేఫ్‌గా వెళ్ళాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను అని బ‌న్నీ అనే స‌రికి స్టేజ్‌పై ఉన్న ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌తో పాటు మిగ‌తా చిత్ర బృందం కూడా చప్ప‌ట్లు కొట్టి అత‌నిని అభినందించారు. త‌న సినిమా ఫంక్ష‌న్‌లో ఇత‌రుల హీరోల సినిమాల‌ని కూడా ఆద‌రించ‌మ‌ని చెప్ప‌డం గొప్ప విష‌యం అంటూ బ‌న్నీపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.