కోటి మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. మీ ప్రేమ‌కు ధన్య‌వాదాలు అంటూ పోస్ట్‌

గంగోత్రి సినిమాతో ఇండ‌స్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. మెగాస్టార్ చిరంజీవి సూచ‌న‌లు పాటిస్తూ ఆయ‌న మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో ముందుకు సాగుతూ వ‌చ్చాడు బ‌న్నీ. ఒక్కో మెట్టూ ఎక్కుతూ కేవ‌లం తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులే కాదు చుట్టు ప‌క్క రాష్ట్రాలు అయిన త‌మిళం, మ‌ల‌యాళం ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ని కూడా గెలుచుకున్నాడు. బ‌న్నీ సినిమాల‌కు తెలుగు రాష్ట్రాల‌ల‌నే ప‌క్క రాష్ట్రాల‌లోను మంచి డిమాండ్ ఉంది. ఆయ‌న సినిమాల కోసం క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తుంటారు.

అల్లు అర్జున్ సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్ అనే సంగ‌తి తెలిసిందే. త‌న సినిమా విష‌యాల‌తో పాటు పిల్లలు, శ్రీమతితో క‌లిసి చేసే సంద‌డికి సంబంధించ‌న విష‌యాల‌ను సామాజిక మాధ్య‌మాల ద్వారా నెటిజ‌న్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఈ క్ర‌మంలో అత‌నిని అనుస‌రించే వారి సంఖ్య క్ర‌మ‌క్ర‌మేపి పెరుగుతూ పోతుంది. తాజాగా అల్లు అర్జున్ ఇన్ స్ట్రాగ్రామ్ ఫాలోవ‌ర్ల సంఖ్య 10 మిలియ‌న్ల మార్క్ ను దాటింది.దీంతో సోష‌ల్ మీడియాలో అత్య‌ ‌ధిక ఫాలోవ‌ర్లున్న సౌతిండియా యాక్ట‌ర్ల‌లో అల్లు అర్జున్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు.

త‌న ఖాతాలో ప‌ది మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ చేర‌డంపై బ‌న్నీ సంతోషం వ్య‌క్తం చేశాడు. నాపై అమిత‌మైన ప్రేమ‌ను చూపిస్తున్న వారంద‌రికి ధ‌న్య‌వాదాలు. నా శ‌క్తిగా ఉన్న మీరంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు. మీ ఆశీర్వాదాల‌కు విన‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాయి. అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు. త‌ను షేర్ చేసిన వీడియోలో త‌న జ‌ర్నీలో అమూల్య‌మైన ఫొటోల‌ని ఉంచి బ్యాక్‌గ్రౌండ్‌లో బుట్ట‌బొమ్మ అనే అనే సాంగ్ పెట్టాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. ఈ ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బ‌న్నీ ప్ర‌స్తుతం పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. మ‌రి కొద్ది రోజుల‌లో ఈ సినిమా మారేడుమిల్లి ప్రాంతంలో రెండో షెడ్యూల్ జ‌రుపుకోనుంది.