సుకుమార్ హెల్త్ చక్కబడింది..’పుష్ప’ మొదలవుతోంది

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప చిత్రానికి అడుగుడుగునా అడ్డంకులు తగులుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ మూలంగా, బృందంలోని కొందరు కరోనా బారినపడటంతో సినిమా షూటింగ్ వాయిదాపడుతూ వచ్చింది. దీంతో ఎప్పుడో పూర్తికావాల్సిన షూటింగ్ ఇంకా సాగుతూనే ఉంది. మధ్యలో సుకుమార్ అండ్ టీమ్ సినిమాను రెండు భాగాలు చేయాలని అనుకోవడంతో చిత్రం నిడివి మరింత పెరిగింది. ఇది సినిమా ఆలస్యాన్ని మరింత పెంచింది. ఇక తాజాగా సెకండ్ లాక్ డౌన్ ముగియడంతో షూటింగ్ పెట్టుకున్నారు.

కానీ తీరా రేపు షూటింగ్ అనగా ఈరోజు సుకుమాడ్ వైరల్ ఫీవర్ బారినపడ్డారు. దీంతో షూట్ జరగలేదు. రెండు రోజులుగా టీమ్ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు సుకుమార్ హెల్త్ కండిషన్ చక్కబడటంతో టీమ్ మళ్లీ సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్దమైంది. ఈరోజు నుండి హైదరాబాద్లో షూటింగ్ మొదలుకానుంది. మిగిలి ఉన్న మొత్తం చిత్రాన్ని ఈ షెడ్యూల్లోనే పూర్తిచేయనున్నారు. మొదటి భాగాన్ని ఈ ఏడాదిలో రిలీజ్ చేసి రెండవ భాగాన్ని 2023లో ప్రేక్షకులకు అందివ్వాలనేది మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల ఆలోచన.