ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదంటున్న అల్లు అర్జున్

Allu Arjun ultimatum to Sukumar
Allu Arjun ultimatum to Sukumar
 
అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘పుష్ప’. లాక్ డౌన్ దెబ్బకు ఇప్పటికే ఒక రిలీజ్ డేట్ మిస్ అయింది.  దీంతో అల్లు అర్జున్ అభిమానులు బాగా అప్సెట్ అయ్యారు.  ఈలోపు చిత్ర బృందం సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు.  దీంతో వారిలో కంగారు కూడ మొదలైంది.  అసలే బన్నీని పాన్ ఇండియా లెవల్లో చూడాలని ఆశపడుతున్నారు వారంతా.  ‘పుష్క’తో ఇండియా లెవల్ క్రేజ్ తెచ్చుకోవాలనేది బన్నీ కోరిక కూడ.  దీంతో ‘పుష్ప’ ఆయన కెరీర్లో కీలకమైన సినిమాగా మారింది.  ఇలాంటి చిత్రం ఒడిదుడుకులకు లోనవుతుండటం, అనూహ్యమైన మార్పులు సంతరించుకోవడంతో టెంక్షన్ మొదలైంది. 
 
మధ్యలో రెండుగా విడగొట్టబడిన సినిమా ఎలా ఉంటుందో ఏమో, త్వరగా మొదటి పార్ట్ రిలీజైతే చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఇక మీదట ఆలస్యం చేసి తమ ఓపికకు పరీక్ష పెట్టవద్దని గట్టిగా చెబుతున్నారు.  అల్లు అర్జున్ సైతం ఇదే ఆలోచనలో ఉన్నారు.  ఆగష్టు నెలలో చిత్రాన్ని రిలీజ్ చేసి తీరాలని డిసైడ్ అయ్యారు.  ఇదే విషయాన్ని డైరెక్టర్ సుకుమార్ వద్ద స్పష్టం చేశారట ఆయన.  సుకుమార్ కూడ అందుకే ఓకే అన్నారట. మిగిలిఉన్న కొద్దిపాటి చిత్రీకరణను జాలైలో ఫినిష్ చేస్తానని, ఆగష్టు నెలలో సినిమా రిలీజయ్యేలా చూస్తానని మాట ఇచ్చారట.  మరి ఆ మాటను ఆయన ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూడాలి.