మేజర్ ప్రతి భారతీయుడు గుండె తాకే సినిమా.. ప్రశంసలు కురిపించిన అల్లు అర్జున్!

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్. ముంబై దాడులలో టెర్రరిస్టుల ఘాతుకానికి బలైన సందీప్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అడవి శేష్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా జూన్ మూడవ తేదీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల మొదటి షో నుంచి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా చూసిన ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ వీక్షించారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఈ సినిమా పై స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. మేజర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు. ఈ సినిమా మనసుకు హత్తుకునేలా ఉంది అడవి శేష్ సిల్వర్ స్క్రీన్ పై మరోసారి తన మ్యాజిక్ తో అందరిని ఆకట్టుకున్నారు. ఇక సినిమాల్లో ప్రతి ఒక్క నటీనటులు ఎంతో అద్భుతంగా నటించారని కొనియాడారు.శ్రీచరణ్‌ పాకాల అందించిన బీజీఎమ్‌ అయితే మతి పోగొడుతోంది శశికిరణ్ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు అంటూ ప్రతి ఒక్కరి పై ప్రశంసలు కురిపించారు.ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాను అందించినందుకు నిర్మాత మహేష్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రతి ఒక్క భారతీయుడి గుండెను తాకేలా ఉంది అంటూ అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా సినిమా పై ప్రశంసలు కురిపించారు.

 

ఇకపోతే అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్ పై హీరో అడివి శేష్ స్పందించారు.క్షణం సినిమా నుంచి మేజర్ సినిమా వరకు మీరు అందించిన సపోర్ట్ మీరు చూపించిన ప్రేమ కు కృతజ్ఞతలు. నా పుట్టినరోజు (డిసెంబర్ 17) న నాకు పుష్ప గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు నా మేజర్ సినిమాని మరింత అందంగా మార్చారు అంటూ అడివి శేష్ ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ పై స్పందించి రీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.