“పుష్ప” పై డైరెక్ట్ తానే క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్.!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప” సినిమా కోసం తెలిసిందే. రెండు భాగాలుగా భారీ అంచనాలతో ఈ సినిమాని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం ని వచ్చే డిసెంబర్ 17 కి రిలీజ్ ఫిక్స్ చేసినట్టు తెలిసిందే. కానీ ఎక్కడో సినిమా రిలీజ్ పట్ల కొన్ని అనుమానాలు ఉన్నాయి.

మరి వాటి అన్నిటికీ కూడా అల్లు అర్జున్ నిన్న “వరుడు కావలెను” ప్రీ రిలీజ్ వేడుకలో ఒక క్లారిటీని ఇచ్చేసాడు. ఈ చిత్రం డిసెంబర్ 17 నే రిలీజ్ అవుతున్నట్టు కన్ఫర్మ్ చేసాడు. సో ఫైనల్ గా బన్నీ నే కన్ఫర్మ్ చేసాడు కాబట్టి సినిమా రిలీజ్ లో ఎలాంటి మార్పు ఉండదని చెప్పాలి. ఇక ఈ చిత్రంకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.