మాఫియా బ్యాక్డ్రాప్ లో అల్లు అర్జున్ కొత్త సినిమా

‘నా పేరు సూర్య’ సినిమా ప్లాప్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ‘అల వైకుంఠపురం లో’ లాంటి భారీ హిట్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఆ తర్వాత వచ్చిన ‘పుష్ప’ అంచులను మించి హిట్ అయ్యింది. ఆ సినిమాతో అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అయితే ఈ సారి అల్లు అర్జున్ తన కెరీర్ ఎలా మ‌ల‌చుకోవాలి? ఎలాంటి క‌థ‌లు ఎంచుకోవాలి? అనే విష‌యంలో బ‌న్నీకి పూర్తి స్ప‌ష్ట‌త ఉంది. అందుకే కొన్ని క‌థ‌ల్ని ఓకే చేసి ప‌క్క‌న పెట్టుకొంటున్నాడు.

తాజా సమాచారం ప్రకారం, డైరెక్టర్ పరశురామ్ అల్లు అర్జున్ కి ఒక కథ చెప్పి మెప్పించాడని తెలుస్తుంది. ‘గీత గోవిందం’ సినిమా తర్వాతే పరశురామ్ అల్లు అర్జున్ తో ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. కానీ, అప్పుడు వీలు పడలేదు.

ఇప్పుడు పరశురామ్ చెప్పిన స్టోరీ లైన్ అల్లు అర్జున్ కి బాగా నచ్చి, ఫుల్ స్టోరీ డెవలప్ చెయ్యమని చెప్పాడని తెలుస్తుంది. ఈ సినిమా ఎలా మ‌ల‌చుకోవాలి? ఎలాంటి క‌థ‌లు ఎంచుకోవాలి? అనే విష‌యంలో బ‌న్నీకి పూర్తి స్ప‌ష్ట‌త ఉంది. అందుకే కొన్ని క‌థ‌ల్ని ఓకే చేసి ప‌క్క‌న పెట్టుకొంటున్నాడు.

ఈ సినిమా మెడిక‌ల్ మాఫియా నేప‌థ్యంలో ఈ క‌థ సాగుతుంద‌ని స‌మాచారం. ఈ మధ్యే మహేష్ బాబు తో ‘సర్కారువారి పాట’ సినిమాతో హిట్ కొట్టిన పరశురామ్ త్వరలో నాగ చైతన్య తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.

అల్లు అర్జున్ త్వరలో ‘పుష్ప’ సీక్వెల్ లో నటించబోతున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ ఇతర సినిమాకు కమిట్ అవ్వలేదు. ‘పుష్ప’ తర్వాత పరశురామ్ తో చేస్తాడో లేక వేరే సినిమా ఏదైనా చేస్తాడో వేచి చూడాలి.