‘మైత్రి’పై అల్లు అర్జున్ అభిమానుల వీరంగం.!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ‘పుష్ప’ సినిమాని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి తొలి భాగం ‘పుష్ప ది రైజ్’ డిసెంబర్‌లో విడుదల కానుంది. ప్రమోషన్స్ విషయంలో మైత్రి బ్యానర్ గురించి కొత్తగా చెప్పుకునేదేముంది.? బీభత్సమైన హంగామా చేస్తుంటుంది.

కానీ, అల్లు అర్జున్ అభిమానులు అంతకు మించి.. ఏదో ఆశిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమానుల అంచనాల్ని మైత్రి సంస్థ అందుకోలేకపోతోంది. పైగా, ‘పుష్ప’ సినిమాకి సంబంధించిన లీకుల వ్యవహారం కూడా అల్లు అర్జున్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.

ఇంకేముంది.? ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ మీద సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ అభిమానులు ‘దాడి’ షురూ చేశారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ వీరాభిమానుల వీరంగం అత్యంత జుగుప్సాకరంగా తయారైందని నిస్సందేహంగా చెప్పొచ్చు.

మైత్రి సంస్థ.. అంటే, తెలుగు సినీ పరిశ్రమలో సూపర్బ్ సినిమాలు అందించిన నిర్మాణ సంస్థ. నిజానికి, మైత్రిపై అభిమానుల గుస్సా.. ఇదే తొలిసారి కాదు. ఇదిలా వుంటే, ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో నిర్మాత దానయ్య మీద కూడా ఎన్టీయార్, రామ్ చరణ్ అభిమానులు ఇలాగే వీరంగమాడుతుంటారు.