Allu Aravind: ఇండియన్ ఆర్మీకి భారీ విరాళం ప్రకటించిన అల్లు అరవింద్…. ప్రశంసలు కురిపిస్తున్న నెట్టిజన్స్!

Allu Aravind: ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్యయుద్ధ వాతావరణ నెలకొన్న విషయం తెలిసిందే. పాక్ భారత్ పై చేస్తున్న దాడిని ఇండియన్ ఆర్మీ తిప్పికొడుతూ పాకిస్తాన్ కు గట్టి సమాధానం ఇస్తుంది. ఇలాంటి ఒక విపత్కర భయంకరమైన పరిస్థితులలో కూడా మనమందరం చాలా స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉన్నాము అంటే అందుకు కారణం మన ఇండియన్ ఆర్మీ సరిహద్దులలో చేస్తున్న పోరాటమే కారణమని చెప్పాలి.

ఇలా మన కోసం మన క్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తూ ప్రాణాలు అర్పిస్తున్నటువంటి ఇండియన్ ఆర్మీ కోసం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భారీగా విరాళం ప్రకటించారు. తాజాగా ఈయన నిర్మాణ సంస్థ అయినా గీత ఆర్ట్స్ బ్యానర్ నుంచి శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగిల్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మార్నింగ్, మ్యాట్నీ షోస్ కి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు కానీ, పాజిటివ్ టాక్ కారణంగా ఫస్ట్ షోస్ నుండి అన్ని ప్రాంతాల్లో పికప్ అయ్యింది.

ఈ క్రమంలోనే కలెక్షన్స్ కూడా పెరగడంతో తప్పనిసరిగా ఈ సినిమా మంచి లాభాలను అందుకుంటుందని స్పష్టమవుతుంది. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ మాట్లాడుతూ మన దేశాన్ని మనల్ని రక్షించడం కోసం ఇండియన్ ఆర్మీ పడుతున్న కష్టాన్ని గుర్తించిన ఆయన సింగిల్ సినిమా నుంచి వచ్చిన లాభాలు అన్నింటిని కూడా ఇండియన్ ఆర్మీకి విరాళంగా ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఈయన చేస్తున్న సహాయం పెద్దదా చిన్నదా అనే విషయం పక్కన పెడితే దేశాన్ని దేశ ప్రజలను కాపాడుతూ సరిహద్దులలో శత్రువులతో పోరాటం చేసినటువంటి సైనికుల గురించి అల్లు అరవింద్ గారికి ఇలాంటి ఆలోచన రావటమే గొప్ప అంటూ నెటిజన్స్ అల్లు అరవింద్ నిర్ణయం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా అల్లు అరవింద్ విరాళం ప్రకటించడంతో తదుపరి మరి కొంతమంది సెలబ్రిటీలు కూడా విరాళాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి.