Nagarjuna: చైతూ..సామ్ విడాకులు ప్రకటన తర్వాత.. స్పందించిన నాగ్.. ఆనందంగా ఉందంటూ!

Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అక్కినేని నాగచైతన్య సమంత జంటగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రేమించుకుని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న ఈ జంట నాలుగు సంవత్సరాలు ఎంతో సంతోషంగా గడిపినప్పటికీ కొన్ని మనస్పర్థల కారణంగా గత ఏడాది అక్టోబర్ 2వ తేదీ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇలా ఈ జంట విడిపోతున్నట్లు చెప్పడంతో ఎంతోమంది అభిమానులు షాక్ కి గురయ్యారు.

ఇక విడాకులు ప్రకటన చేయగానే నాగార్జున స్పందిస్తూ ఇది పూర్తిగా వారి వ్యక్తిగత విషయమేనని వీరిద్దరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పిన విషయం మనకు తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జునకు ఇదే ప్రశ్న రావడంతో మరోసారి చైతన్య విడాకులపై స్పందించారు.ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ఇలా వారిద్దరి విడాకులు తీసుకోవడం ఎంతో బాధాకరమని, ఎలాంటి వ్యక్తి అయినా ఈ విధమైనటువంటి పరిస్థితులను తట్టుకుని నిలబడాలంటే చాలా కష్టమని తెలిపారు.

కానీ నాగచైతన్య మాత్రం ఈ విషయం నుంచి తొందరగా బయటపడి ఎంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. అసలు చైతన్య ఈ పరిస్థితుల నుంచి బయట పడతారో లేదో అని ఎంతో కంగారు పడ్డానని, కానీ చైతన్య నాకు ధైర్యం చెప్పడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని నాగార్జున ఈ సందర్భంగా చైతన్య సమంత విడాకుల గురించి తెలియజేశారు. చైతన్య ఇంత మానసిక పరిపక్వతతో ఆలోచించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు.