తెలుగు హీరోలని దొంగలు అంటున్న సీనియర్ హీరోయిన్

తెలుగు సినిమా హీరోలు సినిమాల్లో మాత్రమే హీరోలు, బయట మాత్రం జీరోలు అని ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాల్లో ఎన్నో మెసేజ్ లు ఇచ్చే హీరోలు ‘మీ టూ’ వివాదం పైన కనీసం స్పందించలేదు. అలాగే టాలీవుడ్ హీరోలు చాలా విషయాల్లో సైలెంట్ గా ఉంటారు.

ఇదే విషయం పై విజయశాంతి కామెంట్స్ చేసారు. 1979లో తొలిసారి కథానాయికగా పదిహేనేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోస్ తో నటించి హీరోస్ తా సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు విజయశాంతి.

సినిమాల్లో హీరోయిన్ గా ఫేడ్ అవుతున్న టైం లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు విజయశాంతి. 1998లో రాజకీయ ఆరంగేట్రం చేసింది. మొదట బిజెపి పార్టీలో చేరిన రాములమ్మ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర లక్ష్యం కోసం 2005లో తెలంగాణ తల్లి పార్టీని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2009లో టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి తెరాస లోనే ఉండిపోయింది. 2009లో మెదక్ పార్లమెంటు నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచింది.. 2013లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటుందని ఆమెను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరింది.. అయితే తను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు సినిమాల్లో నటించే సమయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది.. మీరు ఇంత పారితోషకం తీసుకోవడానికి కారణం తెలంగాణ ప్రజలు కాదా..? దీనిపై మీ స్పందన ఏంటి? మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అంటే ఒక్క హీరో కూడా సమాధానం ఇవ్వలేదు..

మీ బ్యాచ్ హీరోలు భయపడుతున్నారా అని ఒక యాంకర్ ప్రశ్నించగా.. విజయశాంతి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. నా బ్యాచ్ హీరోలంతా ముసుగు వేసుకున్న దొంగలు.. వాళ్లు తీసుకున్న రెమ్యూనరేషన్ లో కనీసం 20 శాతం కూడా ప్రజల కొరకు ఖర్చు చేయడం లేదని.. వారు సినిమాల్లో మాత్రమే హీరోలు కానీ, బయట జీరోలు అనే విధంగా మాట్లాడింది.. ప్రజలు దండేసి అభినందిద్దాం అని అనుకునే ఒక్క హీరో కూడా లేదు అన్నారు విజయశాంతి.