ఇన్సైడ్ టాక్ : మహేష్, త్రివిక్రమ్ సినిమాపై బిగ్ అప్డేట్ ఈరోజున.??

సూపర్ స్టార్ హీరో మహేష్ బహు హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “సర్కారు వారి పాట” భారీ విజయాన్ని సొంతం చేసుకొని స్ట్రాంగ్ వసూళ్లతో దూసుకెళ్తున్నట్టుగా ఆ సినిమా నిర్మాతలు చెబుతున్నారు. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు మరోసారి తన దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఇది ఇంకా స్టార్ట్ కావాల్సి ఉండగా రీసెంట్ గా ఈ సినిమాపై పలు గాసిప్స్ మాత్రం పెద్ద ఎత్తున వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇవి పక్కన పెడితే లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల నుంచి ఆసక్తికరమైన సమాచారం తెలుస్తోంది. దీని ప్రకారం అయితే ఈ సినిమా నుంచి ఈ మే 30న ఒక బిగ్ అప్డేట్ ని మేకర్స్ అనౌన్స్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసారట.

అయితే ఆ అప్డేట్ ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ ఆ డేట్ లో మాత్రం ఒక అప్డేట్ మాత్రం ఈ క్రేజీ కాంబినేషన్ పై వస్తుందని సమాచారం. మరి అదేంటో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు. ఇంకా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ కాగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే త్రివిక్రమ్ ఆస్థాన నిర్మాతలు చిన బాబు మరియు సూర్య దేవర నాగవంశీ లు భారీ స్కేల్ లో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.