Crime News: డబ్బు కోసం దారుణానికి పాల్పడిన యువతి… చెల్లెల్ని ప్రియుడికి అప్పగించి…!

Crime News: ఈ రోజుల్లో ప్రజలు బంధాలు, అనుబంధాల కన్నా డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. డబ్బు కోసం ఎంతటి దారుణమైన పనులు చేయటానికైనా వెనకాడటం లేదు. ముఖ్యంగా యువతీ యువకులు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి నిజానికి పాల్పడుతున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్లో జరిగిన దారుణమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆడదానికి ఆడదే శత్రువు అని మరొకసారి రుజువయ్యింది.

వివరాల్లోకి వెళితే… మొబైల్ ఫోన్, డబ్బుకి ఆశపడి చెల్లెలు వరుస అయ్యే అమ్మాయిని ప్రియుడి వద్దకు పంపిన దారుణమైన ఘటన ఇటీవల పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ , నార్త్ 24 పరగణాల జిల్లాలోని బషీర్హట్ సబ్ డివిజన్‌కు చెందిన యువకుడు, యువతి గత సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ప్రియురాలి కోసం అప్పుడప్పుడు తన ఇంటికి వచ్చే ప్రియుడు ప్రియురాలు చెల్లెలి మీద కన్నేశాడు. ప్రియురాలికి కొత్త మొబైల్ ఫోన్, డబ్బు ఇస్తానంటూ ఆశ చూపి ఒకరోజు చెల్లెల్ని తన వద్దకు పంపమని కోరాడు. డబ్బు ఫోన్ కోసం ఆశపడిన యువతి అతడు కోరిన విధంగా చిన్నారికి మాయమాటలు చెప్పి ప్రియుడి వద్దకు పంపింది.

ఈ క్రమంలో ప్రియుడు చిన్నారి మీద అత్యాచారం చేసి క్రూరంగా ఆమెను కర్రలతో కొట్టి హింసించాడు.ఆ చిత్ర హింసలు భరించలేక బాలిక స్పృహ తప్పి పడిపోవడంతో ఆమె మరణించిందని భావించి ఆ దుర్మార్గుడు బాలికను ఫీషరిస్ సమీపంలో వదిలి వెళ్లాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.బాలిక తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.