తన హీరోయిన్ కాంట్రవర్సీపై ఓపెన్ అయ్యిన “డీజే టిల్లు” హీరో.!

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ ముఖ్యంగా యువత చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎంటర్టైనింగ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది “డీజే టిల్లు”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హీరోయిన్లు సిద్ధూ జొన్నలగడ్డ మరియు మెహబూబా ఫేమ్ నేహా శెట్టి లు నటించిన ఈ చిత్రం మంచి క్రేజ్ తో రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే ఈ సినిమా నుంచి మొన్ననే ట్రైలర్ ని రిలీజ్ చెయ్యగా దానికి సాలిడ్ రెస్పాన్స్ కూడా వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ ట్రైలర్ లాంచ్ లోనే హీరోయిన్ కి ఒక చేదు అనుభవం ఎదురైనా సంగతి తెలిసిందే. ఆమె పుట్టుమచ్చల కోసం అంటూ ఓ విలేఖరి అడుగుతూ వచ్చిన ప్రశ్న పెద్ద దుమారమే రేపింది. మరి సంచలన కాంట్రవర్సీ పై ఇప్పుడు హీరో సిద్ధూ ఓపెన్ అయ్యాడు. నిజానికి ఆరోజు ఘటన తనని చాలా హర్ట్ చేసింది అని సినీ నటులుం అయ్యిన మమ్మల్ని గౌరవించమని మేము అడగం కానీ ఇలాంటి ప్రశ్నలు సరికాదని.

ఒక సీన్ చెయ్యాల్సి వచ్చినపుడు చాలా కష్టపడతాం అని ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ అన్నపుడు మహిళలు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఒక లైట్ బాయ్ సరిగ్గా మా ముఖాల మీదనే ఫోకస్ పెడతాడు. అలా టైం లో కూడా మేము వర్క్ చెయ్యాలి అంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి అయినా ఇలాంటివి అర్ధం చేసుకోకుండా ఇస్టమోచినట్టు మాట్లాడ్డం నిజంగా చాలా బాధాకరం అని తెలిపాడు.

మేము మా సినిమా ట్రైలర్ లాంచ్ కోసం మాత్రమే వచ్చాము అక్కడితో ఇక అది అయ్యిపోయింది ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి, రొమాన్స్, నవ్వులు ఇలా అన్నీ ఉంటాయని తెలిపాడు. ఫైనల్ గా మా నటీ నటుల్ని అయితే తమ వృత్తి పరంగా గౌరవించాలని కోరుకున్నాడు. దీనితో తనకి గాను నెటిజన్స్ పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తున్నారు.