ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇద్దరూ ఐకానిక్ యాక్టర్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ 25 ఏళ్ల నట ప్రస్థానాన్ని ఘనంగా సెలబ్రేట్ చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ తమ బ్యానర్లో రూపొందిన ‘వార్ 2’ ట్రైలర్ను విడుదల చేసింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్లో భాగంగా రూపొందుతోన్న వార్ 2 చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు.
ఇద్దరూ గొప్ప నటులు నువ్వా నేనా అని పోటీ పడి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఆడియెన్స్కి ఎప్పటికీ గుర్తుండి పోతుంది.
వార్ 2 సినిమా హిందీ, తెలుగు, తమిల, భాషల్లో ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా బారీగా విడుదలవుతుంది. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.

