మైత్రి మూవీస్ ద్వారా వరుణ్ సందేశ్ ‘విరాజి’ చిత్రం ఆగస్టు 2న విడుదల

మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా బ్యానర్ పై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం “విరాజి”. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు వీక్షించి ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధం అయ్యారు.

నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ “మా విరాజి చిత్రానికి ఇటీవలే సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. తర్వాత మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు మా చిత్రాన్ని విక్షించి వారి బ్యానర్ ద్వారా మా విరాజి చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధం అయ్యారు. ఇటీవలే విడుదల అయిన టీజర్ కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రం వరుణ్ సందేశ్ కెరీర్ లో పెద్ద విజయం సాధిస్తుంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. వరుణ్ సందేశ్ చాలా కొత్తగా ఉంటాడు. ఆగస్టు 2 న ప్రపంచవ్యాప్తంగా మైత్రి మూవీస్ సంస్థ ద్వారా విడుదల చేస్తున్నాం” అని తెలిపారు.

సినిమా పేరు: విరాజి

నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా, తదితరులు…

సాంకేతిక సిబ్బంది:

దర్శకుడు: ఆద్యంత్ హర్ష
నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల
బ్యానర్: ఎమ్ 3 మీడియా, మహా మూవీస్
డి ఓ పి : జి.వి. అజయ్ కుమార్
సంగీతం: ఎబినేజర్ పాల్ (ఎబ్బి)
ఎడిటర్: రామ్ తూము
కాస్ట్యూమ్ డిజైనర్: రోజా భాస్కర్
మేకప్ చీఫ్: భానుప్రియ అడ్డగిరి
ప్రాజెక్ట్ హెడ్: సుకుమార్ కిన్నెర
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: మల్లికార్జున్ కిన్నెర
ప్రొడక్షన్ మేనేజర్: శ్రావణ్ కుమార్ వందనపు
పి ఆర్ ఓ: పవన్ పాల్
పోస్ట్ ప్రొడక్షన్: సారధి స్టూడియోస్
వి ఎఫ్ ఎక్స్ : అఖిల్
పోస్టర్ డిజైన్స్: జి.దినేష్, గణేష్ రత్నం
స్టిల్స్: మోహన్
అవుట్ డోర్ పబ్లిసిటీ: రత్నకుమార్ శీలం
డిజిటల్ పి ఆర్ : ఎస్ 3 డిజిటల్ మీడియా వర్క్స్
ఆడియో ఆన్: శబరి మ్యూజిక్