ఒక్కచోట చేరిన తమిళ దర్శకులు!

ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచే దర్శకుల్లో టాలీవుడ్‌ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఎక్కువ మంది ఉన్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొట్టే స్టార్‌ డైరెక్టర్లంతా ఒక్క చోట ఎలా ఉంటుంది. అభిమానులకు చూసేందుకు రెండు కండ్లు చాలవా అన్నట్టుగా ఉండే ఆ అరుదైన క్షణం రానే వచ్చింది. కోలీవుడ్‌ లీడిరగ్‌ డైరెక్టర్లు మణిరత్నం, శంకర్‌, గౌతమ్‌ వాసు దేవ్‌ విూనన్‌, ఏఆర్‌ మురుగదాస్‌, కార్తీక్‌ సుబ్బరాజు, లింగుస్వామి, లోకేశ్‌ కనగరాజ్‌ అంతా ఒక్క చోట చేరి సందడి చేశారు. ప్రొఫెషనల్‌ కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండే స్టార్‌ డైరెక్టర్లు ఎప్పుడో కాని ఇలా కలవడం సాధ్యం కాదు. ఇంతకీ వీరంతా ఒక్క చోట చేరడం వెనుక స్పెషల్‌ ఏంటో తెలుసా..? ఇటీవలే డైరెక్టర్‌ శంకర్‌ ఇండస్ట్రీలో 30 ఏండ్లు పూర్తి చేసుకున్నాడని తెలిసిందే. ఈ సందర్భంగా స్టార్‌ డైరెక్టర్లంతా దిగిన ఫొటో నెట్టింట్లో ట్రెండిరగ్‌ అవుతోంది.

ఈ ఫ్రేమ్‌లో ఉన్న డైరెక్టర్లంతా దాదాపు కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ కమర్షియల్‌ హిట్స్‌ కొట్టినవారే కావడం విశేషం. మణిరత్నం ప్రస్తుతం కమల్‌ హాసన్‌తో ఓ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని తెలిసిందే. శంకర్‌ ఓ వైపు గేమ్‌ ఛేంజర్‌, మరోవైపు ఇండియన్‌ 2 సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. లోకేశ్‌ కనగరాజ్‌ ప్రస్తుతం విజయ్‌తో కలిసి లియో చేస్తున్నాడు. అక్టోబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్బార్‌ తర్వాత కొత్త సినిమా ఏవిూ ప్రకటించలేదు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌తో బిజీగా ఉన్నాడు గౌతమ్‌ వాసు దేవ్‌ విూనన్‌ ఓ వైపు యాక్టర్‌గా.. మరోవైపు దర్శకుడిగా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తున్నాడు. లింగుస్వామి కొత్త ప్రాజెక్ట్‌ ప్రకటించాల్సి ఉంది.